మానవ చరిత్రలో శారీరక మానసిక స్థితులు ఒకేలా ఉన్న మనుషులు ఇద్దరు పుట్టలేదు. అంతేకాదు ఒకే సమయంలో పుట్టిన వారందరూ ఒకేలాగా జీవించలేదు. దీనికి ఒకే కారణం వారి ప్రాణశక్తి లో ఉన్న తేడాలు. వ్యక్తి రూపాన్ని వ్యక్తి శీలాన్ని నిర్ణయించేది ఈ ప్రాణశక్తి. మనుషుల్లో ఉన్న వైరుధ్యాలన్నీ ఈ ప్రాణశక్తి లో ఉన్న వైరుధ్యాలే. ఈ రహస్యం తెలిసిన సనాతనులు అనాది నుంచి ప్రాణశక్తిని పెంచే సాధన విధానాలను సూక్ష్మీకరించారు. వాటిలో ప్రాణాయామం ప్రధానంగా ఉన్న హఠయోగం. మంత్ర శబ్దం ప్రధానంగా ఉన్న సహజ యోగం చెప్పుకోదగిన ప్రాచుర్యాన్ని పొందాయి. ఏది ఏమైనా ప్రాణశక్తిని తగిన మోతాదులో పెంచుకోగలిగితే తప్ప మనిషి గుణవంతుడు, ప్రతిభావంతుడు, సౌశీల్యవంతుడు, ఉత్తముడు అవలేడు. అందుకే అందరూ ప్రాణ శక్తిని పెంచుకునే సాధనలు ఏమిటో తెలుసుకుని వాటిని చేసుకోవాలి.
No comments:
Post a Comment