Monday, 1 September 2025

029


వెయ్యిళ్ళ కొత్త సహస్రాబ్ది వందేళ్ళ కొత్త శతాబ్ది మొదలై 25. సంవత్సరాలు గడిచింది. ఇప్పటివరకు చోటు చేసుకున్న మార్పుల్లో అత్యంత ప్రధానమైనది ఏంటి అంటే 15 ఏళ్ల వయసుకే మనిషికి జీవితం అంటే ఏంటో స్పష్టంగా తెలిసిపోయింది. జీవితంలో ముఖ్యమైనది డబ్బు అని ఇంకా స్పష్టంగా తెలిసిపోయింది. అయితే వెయ్యేళ్ళుగా పోగు చేసుకుంటూ వస్తున్న విలువలు మాత్రం ఆదరణ కోల్పోయాయి. ఆత్మ తేజస్సుతో సాగించే జీవన విధానం మరుగున పడిపోయి తార్కిక మేధస్సుతో సాగించే జీవన విధానానికి ప్రాచుర్యం పెరిగింది. అనుభవం చెప్పే మాటలు కంటే ఇంటర్నెట్లో వినపడే మాటలే అందరికీ నచ్చుతున్నాయి. కలిసున్న తరాలు ఇప్పుడు ఒంటరితనాలు అయాయి. పరిస్థితి మారాలంటే ప్రతి ఒక్కరూ సమర్పణ బుద్ధితో సత్కర్మలు చేయటం ఒక ఉద్యమంగా ప్రారంభించాలి. 

No comments:

Post a Comment