ఈ ప్రపంచం కాల లక్షణానికి లోబడి ఉంటుంది. మనిషి కర్మ ప్రభావానికి లోబడి ఉంటాడు. అందుకే వ్యక్తుల అభిప్రాయాలకు ప్రపంచ పోకడలకు సంబంధం ఉండదు. కాల సూత్రానికి కర్మ ప్రభావానికి అనుగుణంగా పుట్టిన మనిషి తన కర్మ ని శుద్ధి చేసుకోవడానికి ఈ ప్రపంచం ఒక వేదిక. అంతకుమించి ప్రపంచంతో మనిషికి ఎలాంటి సంబంధం లేదు. మనిషికి కేవలం తన కర్మతోనే సంబంధం. ఆ కర్మ ఆధారంగా ఈ ప్రపంచంలో కాలం ఇచ్చే అవకాశాల మేరకు మనిషి జీవిస్తాడు. ఆ అవకాశాలు ఇక లేనప్పుడు మనిషి మరణిస్తాడు. జీవుడు ఎప్పటికీ ఒంటరి. కర్మ తప్ప ఇంకే తోడు అతనికి ఉండదు. అందుకే మనిషి ప్రపంచంలో ఎంత ఎగబడినా అతని కర్మ పరిధికి మించి పొందలేడు. అలా కాలం కర్మ ప్రపంచం అనే త్రిభుజం మధ్యలో మనిషి తిరుగుతూ ఉండాల్సిందే. అంతకుమించి ఏమన్నా కావాలంటే మనిషి ఆధ్యాత్మ విద్యని నేర్చుకోవాల్సిందే.
No comments:
Post a Comment