Sunday, 1 February 2026

ప్రమాదంలో Gen Z

పూర్వకాలం మనిషి తన జీవన పరిణామ క్రమంలో పూర్ణ అనుభవాన్ని పొందాడు. అలాంటి అనుభవజ్ఞులను అనుసరించి మరికొందరు పూర్ణులయ్యారు. ఇది తొలిదశ అనే ప్రాచీన కాలం.

కాలక్రమంలో కొందరు మహానుభావులు ఆ అనుభవ సారాన్ని అక్షర స్వరాల్లో పొందుపరిచారు. అలా పొందుపరిచిన సంకలనమే ..  అనేకమంది అనుభవజ్ఞుల జీవన సారమైన .. "వేదం". ఇది మలిదశ అని చెప్పుకోవాల్సిన వేద కాలం. 

తొలి దశలో ఉన్నవారు ప్రాచీన ఋషులు,
మలిదశలో ఉన్నవారు వేద ఋషులు. 
ఈ ఇద్దరి సమగ్ర అనుభవమే వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, శాస్త్రాలు, దర్శనాలు ఇత్యాది గ్రంథాలు. ఈ సమస్త వాఙ్గమయానికి సాక్షి వేద వ్యాసుడు.

ద్వాపర యుగం వరకు ఉన్న వ్యాసునికి కలియుగంలో  ఉత్తరాధికారి ఆది శంకరులు. ఆయన జగద్గురువుగా వేద వాంగ్మయమే పునాదిగా చేసిన ప్రబోధం గత పాతికేళ్లలో మొద్దుబారింది. ఈ కాలంలోనే మత గ్రంథాలపై తర్కం పెరిగి, ఆధ్యాత్మ ఆచరణపై పట్టు తగ్గింది.

దీంతో జెన్ జీ యువత మత గ్రంథాలపై విముఖత పెంచుకుంది. జీవన నియమాలను వివరించే ఆధ్యాత్మికతను మత కార్యక్రమాలు గా భావించి కొట్టి పారేస్తోంది. ఈ నేపథ్యంలో  గ్రంథాలు అంటే "అనుభవం" పొందే మార్గాలు  అని చెప్తూ ఆధ్యాత్మ ఆచరణ వైపు నేటి తరాన్ని నడిపించాలి.

2 comments: