అన్నిటికీ "నేను" ఆధారం. నేను అంటే అహం. నేను అంటే గుర్తు. నేను అనుకోకుండా ఏ మనిషి ఉండలేడు. నేను కి పునాది ఆలోచనలు అభిప్రాయాలు. వాటికి పునాది, మనిషి చుట్టూ జరిగే సన్నివేశాలు సంఘటనలు. అవి ఏర్పడే వేదికనే "ప్రపంచం" అంటారు.
ఈ విధంగా ప్రపంచం "నేను"ను ఆక్రమించి ఉంటుంది. ప్రపంచం ఆక్రమించి ఉన్న నేను నే అహం అంటారు. ఈ అహం వల్లనే మనిషికి సంఘర్షణ ఏర్పడుతూ ఉంటుంది. సంఘర్షణలేని ప్రశాంతత కావాలి అంటే అహం కరిగిపోవాలి. అంటే ప్రపంచం కల్పించే సన్నివేశాలు సంఘటనలు వల్ల ఏర్పడే ఆలోచనలు అభిప్రాయాలు మనిషి పై ప్రభావం చూపకూడదు.
ప్రపంచం అనే "మూడు అంశాల" ద్వారా అహాన్ని రెచ్చగొట్టే "రెండు పరిణామాలు" ఏర్పడటానికి మూల కారణం ఇష్టా ఇష్టాలు. ఇలా ఒకదాని వల్ల మరొకటి జరగటాన్ని అంటే "పరిణామాల క్రియాశీలత"ను దృష్టిలో ఉంచుకునే నేను నాది అనే భావనల నుంచి దూరం అవ్వాలి, అప్పుడే ప్రశాంతత ఏర్పడుతుంది.
కాలం మారుతూ ఉంటుంది. అంటే కాల లక్షణం మారుతూ ఉంటుంది అని అర్థం. అందుకే కాలానికి అనుగుణంగా అవగాహన మారుతుంది. అవగాహనకి అనుగుణంగా నిర్వచనాలు మారుతూ ఉంటాయి. కానీ సృష్టికి సంబంధించిన పరిణామాల విధానం ఎప్పటికీ మారదు.
No comments:
Post a Comment