తపస్సు అంటే మనస్సుని క్రమంగా (ఎన్నేళ్లకో తెలీదు) ‘మరొకటి’ తనలో కలిపేసుకునే సాధన చెయ్యడం. దానికి మోహం ఒక్కటే అడ్డు. ఆ మోహానికి దేహం ఆధారం. దేహానికి ఆహారం ఆలంబన. ఆహారానికి ‘ఆర్థికం’ అవసరం. దానికి మూలమైన మోహం నుంచి తప్పుకోవడానికి యాచన (భిక్షాందేహీ) మాత్రమే మార్గం.
ఏ మనిషీ తనకు తెలిసిన దానితో జీవితమంతా ఆనందంగా గడపలేడు. ఏ మనిషీ తన ఆనందం కోసం సమస్తాన్నీ తెలుసుకోలేడు. ‘తను’ సత్యం, తను పొందాల్సిన ‘ఆనందం’ సత్యం. ఆ సత్యానుభవమే ‘అహం బ్రహ్మస్మి’.
‘ప్రయత్నం’ మానసికం అయినప్పుడు జయాపజయాలు తప్పవు. అదే ప్రయత్నం ‘‘దైవికం’’ అయినప్పుడు అంతా ఆనందమే. ఈ సత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడమే మనందరి కర్తవ్యం.
ప్రతి పనిని మన ప్రతిభతో కాకుండా దైవ భావనతో చేపట్టినపుడు, నైపుణ్యం పెరగడమే కాకుండా, ఆనందం రెట్టింపు అవుతుంది. ‘దైవం .. మన ఆనందం కోసం’ అన్న భావనే ఆధ్యాత్మికానికి పునాది.
LISTEN.
Do not speak, do not see.
LISTEN.
Close your lips, close your lids.
LISTEN.
The ability to 'do' can be acquired only when the humility to listen manifests. 'Doing' is the fascinating result of attentive listening. A person can not understand beyond his/her mind unless he/she listens to the 'experienced' with submission. Are you ready to listen? Enjoy the life however it unfolds.
ఆకలితో ఉన్నవాడికి అన్నం ముఖ్యం కానీ, ఆత్మజ్ఞానం కాదు అని ఆదిశంకరులు చెప్పారు. దేవుడు మీద నమ్మకంతో, దైహిక - ప్రాపంచిక అవసరాల మీద నుంచి "ధ్యాస"ని మళ్లించిన వాడికి "అనంత శక్తి" అనుభవమవుతుందని కూడా ఆదిశంకరులు స్పష్టంగా చెప్పారు.
మనిషికి రెండు ధ్రువాలు ఆధారం. ఒకటి ఆలోచన. రెండవది అనుభవం. ఆలోచనను ప్రేరేపించేది 'దృశ్యం'. అనుభవంలో శాంతినిచ్చేది 'సాత్వికం'. అంటే .. సాత్వికానుభావాన్నిచ్చే దృశ్యం మాత్రమే 'సద్భావన'కు పునాది అవుతుంది. సద్భావనలను స్మృతిలో నిలుపుకోవడమే 'ఆరాధన'.
In terms of the universal cosmology vaikhari, madhyama and pashyanti sounds correspond respectively to bhuh, bhuvah, and svah. కర్మకి గల కార్య స్థానాల స్థాయిలు కూడా అవే. (శరీరం, మనసు, స్ఫురణ) para స్థితిలో ఉన్న శబ్దం .. ఒక్కటే కర్మ రహితమైనది. (అవాజ్గ్మానస గోచరం) జీవిని ఆ స్థితికి చేర్చగలిగినదే 'గాయత్రీ మంత్రం'.
మనిషికి ఉన్న శక్తి పేరు ఇష్టం. మిగిలినవన్నీ దాని సామర్ధ్యాలు మాత్రమే. ఈ ఇష్టం మనసు పరిధి దాటి వ్యవహరిస్తే ఆ వ్యవహారాన్ని ఆరాధన అంటారు. మామిడాకుకు మూడు నామాలు ఏమిటనుకోవచ్చు. అరె ఇది కూడా ఎంతందంగా ఉందో అనచ్చు. అందుకే ఆరాధన మనసుకి ఎబ్బెట్టుగా, మనసు దాటితే తన్మయత్వంగా ఉంటుంది. జీవనశైలి స్వచ్ఛంగా ఉంటే దాని ప్రభావం జడంగా ఉండదు.
శుద్ధమైన శబ్దం .. అక్షరంగా, భాషగా, లిపిగా దిగివచ్చిన నిచ్చెనమీదుగానే .. శుద్ధమైన శబ్దంలోకి ఎగబాకే సాధనే "ఆథ్యాత్మికం".తీపిదనం ఉన్నది 'ఘనమైనా. ద్రవమైనా' జిహ్వామోదమే.శుద్ధ శబ్దంగా ఉన్నది 'ఏదైనా, ఎలాంటిదైనా' సహమోదమే.
మనసులో పుట్టే భావోద్వేగాల వల్ల
సిద్ధాంతాలు తయారవుతాయి.
మనసుకు అవతల మాటలకు అందని
స్థితి వల్లనమ్మకం ఏర్పడుతుంది.
సర్వేంద్రియాణామ్ నయనం ప్రధానం అన్నారు. ఎందుకంటే దృశ్యమే ఇంద్రియాలను తీవ్రంగా ప్రేరేపిస్తుంది. అందుకే ఇంద్రియాలను శాంతపరిచి సాత్వికమైన భావాలను ఉద్దీపనం చేసేందుకే .... దృశ్య ప్రధానమైన ..విగ్రహారాధన ప్రతిపాదితమైంది. అదీగాక, ఆలంబన లేని నిరాకార ఆరాధనలోని అగాధాన్ని దాటించేది విగ్రహారాధనే.
సంప్రదాయం ఉన్న జీవనంలోనే జీవం ఉంటుంది. కాబట్టే 'పండగ' ఇప్పటికీ 'కొత్త బట్టలు' కట్టుకుంటోంది. అమ్మ కుట్టించిన బట్టల్ని తోబుట్టువులతో కలిసి తొడుక్కుంటే .. ఆ 'పండగే' జోషే వేరు. అమ్మ చెయ్యి పట్టుకుని గుడికి వెళ్లి పెట్టిన... ఆ 'దండం'లో థ్రిల్లే వేరు. అమ్మ వండిన అప్పచ్చిని ఆటల్లో తింటుంటే .. ఆ 'ఆకలి' టేస్టే వేరు. అమ్మ చుట్టూ తిరుగుతూ బుధ్ధిగా నేర్చుకున్న ... ఆ 'జీవితం' విలువే వేరు. పండగ ఓ inspiration. బతుకును 'పండించు' కోవడానికి. సంప్రదాయంగా జరుపుకునేదే పండగ. పండగని వేడుకలా చేసుకోకూడదు.
No comments:
Post a Comment